డోన్: డోన్ ఎమ్మెల్యే కోట్లను మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూలు జిల్లా పరిషత్ నూతన సీఈఓ
Dhone, Nandyal | May 6, 2026 డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డిని కర్నూలు జిల్లా పరిషత్ నూతన సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన రమణ రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోట్లను శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు మెరుగైన పాలన అందించాలని, అభివృద్ధికి సహకరించాలని ఆయనను కోరారు.