డోన్: పిపిపి సర్వేలో మద్దిలేటి స్వామి ఆలయానికి ప్రథమ స్థానం
Dhone, Nandyal | May 22, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని వైష్ణవ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పీపీపీ సర్వేలో డీసీ హోదాలో రాష్ట్రంలో ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు, సిబ్బందిని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి అభినందించారు. అనంతరం రామాంజనేయులు, అధికారులు ఎమ్మెల్యేను శాలువా, పూలమాలతో సత్కరించారు.