నంద్యాల అర్బన్: పాండురంగాపురం లో వైసీపీ సీనియర్ నాయకుడు మృతి,కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే శిల్పారవి రెడ్డి
Nandyal Urban, Nandyal | Jul 14, 2026
నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామం రైతు నాయకుడు బొర్రా అప్పిరెడ్డి మూడు రోజుల క్రితం స్వర్గస్తులైనారు వారి కుటుంబ సభ్యులను మంగళవారం మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పరామర్శించారు పాండురంగాపురంలో ఎంతోమంది రైతులకు ఆదర్శంగా నిలిచిన బొర్రా అప్పి రెడ్డి గారు మరణించడం బాధాకరమైన విషయమని ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేశారు.. వారి వెంట మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి నంద్యాల మండలం వైసిపి అధ్యక్షుడు బసవేశ్వర్ రెడ్డి గ్రామ నాయకులు మధుసూదన్ రెడ్డి కొండ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..