డోన్ లో డ్రైనేజీ వ్యవస్థ పై ప్రత్యేక చొరవ తీసుకోవాలి అధికారులు ఆదేశించిన ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | May 21, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ఆయా వార్డుల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని మిషన్ ద్రోణాచార్య కార్యక్రమంలో భాగంగా 4వ వార్డులో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కాలనిలలో డ్రైనేజ్ వ్యవస్థపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని, మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రజలు తగ్గించాలని కోరారు.