కోడి పందాలు ఆడుతున్న 15 మందిని ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోడిపందాలు ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.43,750 నగదు, రెండు కోళ్లు, 10 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కోడి పందాలు పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని పోలీసులు జూదగాలను హెచ్చరిస్తున్నారు. ఎక్కడన్నా పేకాట కోడిపందాలు ఆడుతున్నట్లు గుర్తిస్తే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.