అదిలాబాద్ అర్బన్: షహీద్ భగత్ సింగ్ నేటి యువతకు ఆదర్శప్రాయుడు: ఏఐవైఎఫ్ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి మెస్రం భాస్కర్
షహీద్ భగత్ సింగ్ నేటి యువతకు ఆదర్శప్రాయుడని ఏఐవైఎఫ్ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి మెస్రం భాస్కర్ అన్నారు. ఆదివారం భగత్ సింగ్ 118వ జయంతిని పురస్కరించుకుని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ క్యాప్ కార్యాలయం ఎదుట భగత్ సింగ్ విగ్రహం కి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మెస్రం భాస్కర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య పోరాటంలో భగత్ సింగ్ నిర్వహించిన పాత్ర యావత్తు దేశం విస్మరించరానిదని, 12ఏళ్ళ అతి చిన్న వయసులోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని 23 ఏళ్ళ యువప్రాయంలోనే దేశం కోసం ప్రాణాలర్పించి ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలిచి దేశ భక్తిని రగిలించిన సమరయోధుడన్నారు