నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS ఆదేశాల మేరకు గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో తెల్లవారుజామున పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు, నేరచరిత్ర గలవారి ఇళ్లలో సోదాలు చేసి రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. సరైన ధ్రువపత్రాలు లేని 6 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలతో సమావేశం నిర్వహించి సైబర్ క్రైమ్, రోడ్డు ప్రమాదాలు, బాల్యవివాహాల నివారణ, C.C కెమెరాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.