కుప్పం ప్రాంతంలో హడలెత్తిస్తున్న ఏనుగులు గ్రామాల వైపు రాకుండా ఎప్పటికప్పుడు అటవీ సిబ్బంది ట్రాక్టర్ల ద్వారా డ్రైవ్ చేస్తున్నారు. ప్రస్తుతం 5 ఏనుగులు నడుమూరు ఫారెస్టు 3 కిలోమీటర్ల దూరంలోని తమిళనాడు రాష్ట్రం కాళీ కోయిల్ అటవీ ప్రాంతంలో ఉన్నట్లు ఎఫ్.ఆర్. ఓ జయశంకర్ తెలిపారు. 3 ఏనుగుల గుంపు రామకుప్పం మండలంలోని బల్ల అటవీ ప్రాంతంలో ఉండగా ఏనుగుల కదలికలను ఎప్పటికప్పుడు ఫారెస్ట్ సిబ్బంది మానిటరింగ్ చేస్తున్నారు.