అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం దిగువ పాల్యం కు చెందిన దళిత నాయకుడు భాస్కర్ పై అగ్రవర్ణ కులానికి చెందిన దర్శన్ గౌడ్ చేసిన పైశాచిక దాడిపై పోలీస్ స్టేషన్లో మాల మహానాడు రాష్ట్ర నాయకులు డాక్టర్ యామల సుదర్శన్, మల్లెల మోహన్, రవి ,చంద్రయ్య ,తదితరులు శుక్రవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర నాయకులు యామల సుదర్శన్ మాట్లాడుతూ భాస్కర్ పై దాడికి పాల్పడ్డా దర్శన్ గౌడ్ పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు సంఘం సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.