ఉరవకొండ: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈనెల 12 న ఉరవకొండలో వైస్సార్సీపీ ప్రజాఉద్యమం
ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైస్సార్సీపీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజ వర్గ కేంద్రంలో ఈనెల 12 బుధవారం వైస్సార్సీపీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు వై. విశ్వేశ్వర్ రెడ్డి నాయకత్వంలో జరిగే "ప్రజా ఉద్యమం" కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వజ్రకరూరు లో మంగళవారం మండల పార్టీ అధ్యక్షులు బిందెల సోమశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ నాయకులతో కలిసి పోస్టర్లు విడుదల చేశారు . ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఉస్మాన్, చాబాల సర్పంచ్ మల్లెల జగదీష్ , మైనార్టీ నాయకులు కట్టా కాజా పీరా, రఘుపతి, తిప్పారెడ్డి, జాఫర్, ఆదినారాయణ, ధర్మపురి అశోక్ పాల్గొన్నారు