గుండ్లపల్లి: మండల కేంద్రంలోని విత్తనాలు, ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ జిల్లా, డిండి మండల కేంద్రంలోని పలు విత్తనాలు, ఎరువుల దుకాణాలను శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిలువలను, స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డీలర్లు అందరూ ఈపాస్ ఆధార్ ఆధారిత పద్ధతిలో విక్రయాలు జరపాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డిఓ రమణారెడ్డి, తహసిల్దార్ శ్రీనివాస్ గౌడ్, ఏపీఓ జయరాజు, ఏవో రెహనా తదితరులు ఉన్నారు.