నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం శనివారం జరిగింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి పాలకవర్గ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ముఖ్యంగా మార్కెట్ యార్డులో నూతన భవనాల నిర్మాణానికి రూ.50 లక్షలు నిధులు కేటాయించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నం రాజేశ్వరి ప్రసాద్ తీర్మానించగా, సభ్యులు ఆమోదం తెలిపారు. రానున్న రెండేళ్లలో రైతుల సంక్షేమానికి కృషి చేయాలని పాలకవర్గ సభ్యులకు చైర్మన్ రాజేశ్వరి ప్రసాద్ సూచించారు.