నందికోట్కూరు: నందికొట్కూరు పట్టణ ప్రజలకు మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి కీలక సూచన
నంద్యాల జిల్లా నందికొట్కూరు నేటి నుంచి వారం రోజుల పాటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, నందికొట్కూరు పట్టణ ప్రజలు జాగ్రత్తలు పాటించాలని మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రామిరెడ్డి గురువారం పేర్కొన్నారు, ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని సూచించారు, బయటకు వెళ్లేటప్పుడు గొడుగు,టోపీ లేదా గుడ్డతో తలను కప్పుకోవాలన్నారు, నీరు మజ్జిగ కొబ్బరి నీరు నిమ్మరసం, పండ్ల రసాలు వంటి దవపదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలన్నారు, మధ్యాహ్న సమయంలో బయట పనులు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు.