పెద్ద కడబూరు:ఎంపీటీసీలకు గౌరవ వేతనం విడుదల చేయాలని శనివారం పెద్దకడబూరు మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ శ్రీవిద్య, వైస్ ఎంపీపీలు ముత్తమ్మ, ఇర్ఫాన్ దేశాయ్, ఎంపీటీసీలు వెంకటేశ్, సుజాత, కుదే లక్ష్మి ఎంపీడీవో ప్రభావతి దేవికి వినతిపత్రం అందజేశారు. 26 నెలలుగా కూటమి ప్రభుత్వం ఎంపీటీసీలకు వేతనాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. తక్షణమే వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.