అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా గార్లదిన్నె సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 2, 2026
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని గార్లదిన్నె మండల కేంద్రంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో గార్లదిన్నెకు చెందిన ఖాదర్బాషా ఆశ, తోపాటుగా చిన్న జలాలపురం కు చెందిన నాగేంద్ర అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.