ఓర్వకల్లు మండల సచివాలయంలో పనిచేయని ఆధార్ అప్డేట్ కేంద్రం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నట్లు సిపిఎం మండల కార్యదర్శి బి.నాగన్న అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని కంప్యూటర్లను పునరుద్ధరించి తక్షణమే ఆధార్ అప్డేట్ సేవలు ప్రారంభించాలని, మండలంలోని ఇతర గ్రామాల్లో కూడా కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.