అక్రమాస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డు ఏడీ శ్రీనివాస్ను ఏసీబీ అరెస్టు చేసింది. అతడి నివాసం, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు తెలంగాణ, ఏపీ, కర్ణాటకల్లో భారీగా ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. మొత్తం ఆరు ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. రూ.5లక్షల నగదు, 1.6 కిలోల బంగారం, 770 గ్రాముల వెండి, 2 కార్లు, కోట్ల విలువైన భూమి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.