సిర్పూర్ టి: కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను కాగజ్నగర్ లో దహనం చేసిన సిపిఎం పార్టీ నాయకులు
42% రిజర్వేషన్లు కల్పించాలని రాజుభవన్ ముట్టడికి బయలుదేరిన సిపిఎం పార్టీ నాయకులను కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి లాఠీ చార్జీ చేయడంతో కాగజ్నగర్ పట్టణంలో సిపిఎం పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని సిపిఎం పార్టీ నాయకుడు ముంజం ఆనంద్ కుమార్ తెలిపారు,