మంత్రాలయం : మండలం సుంకేశ్వరి గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ కార్యకర్త బీరప్ప శుక్రవారం మృతి చెందాడు. బీరప్ప మృతదేహానికి కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు ప్రదీప్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఓదార్చారు. వైసీపీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈయనతో పాటు వైసిపి నాయకులు మృతుడికి నివాళులర్పించారు.