డోన్: డోన్లో మినీ మహానాడు రద్దు : ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి
Dhone, Nandyal | May 16, 2026 మే 19న డోన్ పట్టణంలోని సాయి ఫంక్షన్ హాల్లో జరగాల్సిన మినీ మహానాడు రద్దయింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి శనివారం వెల్లడించారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు, ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన వివరించారు. ఈ మార్పును తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్య కర్తలు గమనించి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.