అక్రమ ఆస్తుల కేసులో మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని ధర్మవరం ఎమ్మెల్యే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేసి మాట్లాడుతూ ఆరు సంవత్సరాల తర్వాత సిబిఐ కోర్టుకు హాజరవుతున్న సందర్భంగా బలా ప్రదర్శన చేయడం సిగ్గుచేటు అన్నారు.