గుత్తి పట్టణంలోని గుట్టమీద కాలనీ లో గత 15 రోజుల క్రితం తాగునీటి పైప్ లైన్ పగిలిపోయింది. దీంతో కాలనీకి తాగునీటి సరఫరా నిలిచిపోయింది. కాలనీవాసులు మున్సిపల్ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో సోమవారం కాలనీవాసులు స్పందించి తమ సొంత డబ్బుతో పగిలిపోయిన పైప్లైన్ తొలగించి కొత్త పైప్లైన్ ఏర్పాటు చేసుకున్నారు. దీంతో కాలనీకి తాగునీరు సరఫరా అయింది.నీటి సమస్య తీరింది.