ఒంగోలు అర్బన్: తల్లిని ఇంట్లో ఉంచి ఇంటికి నిప్పు పెట్టిన కుమారుడు తల్లి వెంకటరమణ సజీవ దహనం.
Ongole Urban, Prakasam | Apr 14, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం జరిగింది. మతిస్థిమితం సరిగ్గా లేని కొడుకు కన్నతల్లి ఉంటున్న ఇంటికి నిప్పు అంటించి పరారయ్యాడు. ఇంట్లో మంటలు చెలరేగి తల్లి సజీవ దహనం అయింది. మంగళవారం ఒంగోలులోని గద్దలగుంటలో ఈ దారుణం ఘటన చోటు చేసుకుంది. గద్దలగుంటలో 70 ఏళ్ల వృద్ధురాలు వెంకటరమణమ్మ తన కొడుకు కిషోర్ బాబు తో కలిసి జీవిస్తుంది. వ్యసనాలకు బానిసైన కిషోర్ బాబు కి మతి స్థిమితం సరిగా లేని చెబుతున్నారు. వేకువ జాము సమయంలో ఇంట్లో ఉన్న చీరలకి నిప్పు అంటించాడు. మంటలు ఒక్కసారి ఎగసిపడటంతో కిషోర్ బాబు అక్కడి నుండి పరారయ్యాడు. ఎగసిపడుతున్న మంటలు చూసి స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.