ఇబ్రహీంపట్నం: రేవంత్ రెడ్డి చర్యల వలన నగరంలో ప్రజలు భూములు కొనాలంటే భయపడుతున్నారు: ఎంపీ ఈటల రాజేందర్
రంగారెడ్డి జిల్లా వినాయక నగర్ డివిజన్ పరిధిలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ శనివారం మధ్యాహ్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైడ్రా విషయంలో సీఎం రేవంత్ రెడ్డివి పిచ్చి మాటలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చర్యల వలన నగరంలో భూములు కొనాలంటే ప్రజలు భయపడుతున్నారని అన్నారు.