సత్య సాయి జిల్లా రామగిరి మండల కేంద్రంలో గురువారం మూడు గంటల యాభై ఐదు నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రామగిరి మండల కేంద్రంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రామగిరి లో రైతులు పండించిన కందులు కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని, ఈ ఏడాది మండలంలో 84 ఎకరాల్లో కంది పంట సాగు చేయగా ఇప్పటికే 298 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వీరి వద్ద నుంచి ఎకరాకు గరిష్టంగా నాలుగు క్వింటాలు చొప్పున కొనుగోలు చేపడుతున్నామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.