ఒంగోలు అర్బన్: ఆరుగురు సభ్యుల దొంగల ముఠా ఒంగోలులో తిరుగుతుంది జాగ్రత్త : ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Ongole Urban, Prakasam | May 23, 2026
ఆరుగురు సభ్యులతో కూడిన దొంగల ముఠా ఒంగోలులో తిరుగుతుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పి హర్షవర్ధన్ రాజు కోరారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒంగోలులో తిరుగుతున్న సమాచారం తనకు ఉందని దానికోసం ప్రత్యేకమైన చర్యలను కూడా చేపట్టినట్లుగా ఆయన తెలియజేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి కొత్త వ్యక్తులు ఎవరిని గమనించిన వెంటనే డయల్ హండ్రెడ్ లేదా డైల్ 100 కు లేదా డైల్ 1 1 2 కు సమాచారం ఇవ్వాలని కోరారు. అయితే ఆ ముఠా చెడ్డి గ్యాంగ్ కి సంబంధించిందా లేక వేరే అనేది ఎంక్వయిరీ చేస్తున్నామన్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ చేపట్టామన్నారు