సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట లోని ఓ ప్రైవేట్ కాలేజీ విద్యార్థులు కరాటే పోటీల్లో మెడల్స్ సాధించారు. వారిలో శ్రీమణికంఠ మైనస్ 45లో సిల్వర్ మెడల్, అండర్ 19 విభాగంలో అనంత కుమార్ మైనస్ 58లో సిల్వర్ మెడల్, అండర్ 17 విభాగంలో సంతోశ్ మైనస్ 66లో బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు. మెడల్స్ సాధించిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ ఆదివారం ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో కూడా క్రీడల్లో రాణించి సత్తా చాటాలని సూచించారు.