డోన్: ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలంటూ బేతంచెర్ల తాసిల్దార్ కు వినతి పత్రం అందించిన సిపిఐ నాయకులు
Dhone, Nandyal | Jun 23, 2026 కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న 'జి-రామ్ జీ' చట్టం వల్ల గ్రామీణ ఉపాధి హామీ పథకం బలహీనపడే ప్రమాదం ఉందని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి దస్తగిరి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు తహశీల్దార్ నాగమణికి వినతిపత్రం సమర్పించారు. కొత్త విధానం అమల్లోకి వస్తే ఉపాధి హామీ నిధులు గణనీయంగా తగ్గుతాయని, కాబట్టి ప్రస్తుత చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని ఆయన కోరారు.