ఆనమయ్య జిల్లా: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించే పథకాన్ని అధికారులు అందిస్తున్నారు. ఆ భాగంగా వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీమతి యం. విజయ సునీత, IAS మరియు శ్రీ ఆదర్శ్ రాజేంద్రన్, IAS, జాయింట్ కలెక్టర్, అన్నమయ్య జిల్లా వారి నేతృత్వంలో నెల్లూరు జిల్లా రైతుల నుండి నిమ్మ పంటను మార్కెట్ యార్డులో కొనుగోలు చేసి రైతులకు న్యాయమైన ధరలను అందించారు.ఈ సందర్భంగా, మదనపల్లి రైతు బజార్ లో నిమ్మకాయలను కిలో రూ.20/ గా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.