పురాతన ఆలయాలను కాపాడటమే కాకుండా అభివృద్ధికి చర్యలు చేపడతామని దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలోని గవి మఠం ఆలయాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గవిమఠం స్థలంలో కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయని వాటిని పరిశీలిస్తున్నామన్నారు. మైసూర్ మహల్ శిథిలావస్థకు చేరడం పట్ల స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్నహోబిలం ఆలయ రథం నిర్మాణానికి వేగవంతంగా చర్యలు చేపడతామని ప్రాంతీయ సంయుక్త కమిషనర్ పేర్కొన్నారు.