పామూరు: డిసెంబర్ ఒకటో తేదీ నుండి పామూరు మండలంలో సిపిఎం పార్టీ పాదయాత్రను చేపడుతున్నట్లు సిపిఎం పార్టీ ప్రకాశం జిల్లా నాయకులు సయ్యద్ హనీఫ్ తెలిపారు. పామూరులోని సిపిఎం పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.... పామూరు మండలంలోని దూబగుంటలో ట్రిపుల్ ఐటీ కళాశాల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని పెదచెర్లోపల్లి మండలాన్ని వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోకి చేర్చాలని, వెలిగొండ ప్రాజెక్టుకు వచ్చే బడ్జెట్లో రూ.4 వేల కోట్లు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్ర పామూరు మండలంలోని గ్రామాల్లో కొనసాగుతుందన్నారు.