కందుకూరులో మద్యం షాపులపై అధికారుల నిర్లక్ష్యం...
కందుకూరులో కొంత మంది రెస్టారెంట్ నిర్వాహకులు తెల్లవారుజామునే షాపులు తెరిచి మందుబాబులకు మద్యం అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉదయం 10 గంటలకు షాపులు తెరచి, రాత్రి 10 గంటలకు మూసివేయాలన్న జీవో జారీ చేసినా అమలు మాత్రం కనబడటం లేదు. ఎక్సైజ్ అధికారులు వైనపులు, బెల్ట్ షాపులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా మామూల్ల మత్తులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో స్థానికులు ఆరోపిస్తున్నారు.