ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో డిసెంబర్ 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ సౌజన్యంతో టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొర్రెపాటి లక్ష్మీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పట్టణంలోని గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ఉదయం 10 గంటలకు జరుగు జాబ్ మేళా కార్యక్రమంలో 9 కంపెనీలు పాల్గొంటున్నట్లు తెలిపారు. 18 నుండి 30 సంవత్సరాలు గలిగిన పదో తరగతి నుండి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దర్శి నియోజకవర్గంలోని యువత అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కోరారు