విలువలతో కూడిన విద్య, విశ్వసనీయతను కలిగి ఉండటమే ఏపీ వైయస్సార్ టి ఏ లక్ష్యం అని ఏపీ వైఎస్ఆర్టిఏ బెళుగుప్ప మండల కమిటీ సభ్యులు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సోమవారం సాయంత్రం పాఠశాల క్లస్టర్ హెచ్ఎం వెంకటప్రసాద్, ఏపీ వైయస్సార్ టి ఏ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోవిందరెడ్డి తదితరులు స్థానిక ఉపాధ్యాయులతో కలిసి 2026 నూతన సంవత్సర క్యాలెండర్ డైరీలను ఆవిష్కరించారు. ఉపాధ్యాయ వృత్తికి అంకితం అవుతూ తమ హక్కుల కోసం పోరాడటమే సంస్థ లక్ష్యమని వారు పేర్కొన్నారు.