ప్రకాశం జిల్లా కంభం కు చెందిన వైసిపి నాయకుడు చెన్నారెడ్డికి గిద్దలూరు కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ గురువారం అర్ధరాత్రి తీర్పించింది. ఈనెల 10వ తేదీన కంభంలో ఓ ప్లెక్సీ తొలగించే వివాదంలో చెన్నకేశవులు తనపై చెన్నారెడ్డి దాడి చేయడంతో పాటు కులం పేరుతో దూషించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ అనంతరం గురువారం అర్ధరాత్రి శుక్రవారం తెల్లవారుజామున గిద్దలూరు ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి చెన్నారెడ్డికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చారు. అనంతరం పోలీసులు చెన్నారెడ్డిని గిద్దలూరు సబ్ జైలుకి తరలించారు.