ఒంగోలు అర్బన్: ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు అవగాహన ర్యాలీ
Ongole Urban, Prakasam | Jun 5, 2026
పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రకాశం భవనంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యత నిర్వహిస్తామంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పై కలెక్టర్ సంతకం చేశారు. అనంతరం ప్రకాశం భవనం నుంచి మినీ స్టేడియం వరకు అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రభుత్వంతో పాటు సహకరించాలన్నారు