ఫిర్యాదిదారుల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం ఒంగోలు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి వివి రమణ కుమార్ మరియు పోలీస్ అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను పోలీస్ అధికారులు ఫిర్యాదిదారులతో ముఖాముఖిగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఉద్యోగ సంబంధిత / ఆన్లైన్ మోసాలు, భూ వివాదాలు తదితర అంశాలకు సంబంధించిన58 ఫిర్యాదులు వచ్చాయి