రాయచోటి మండలంలోని చిన్న ముక్కపల్లి గ్రామంలో భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీ–సర్వే కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వారి సోదరులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం గ్రామాల్లో రీ–సర్వే పనులను ప్రారంభించింది.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ నరసింహకుమార్, డిప్యూటీ తహసిల్దార్, సర్వేయర్ చంద్రశేఖర్లతో పాటు టిడిపి నాయకులు కొండారెడ్డి, ఎంపీటీసీ ప్రభాకర్ రెడ్డి, గడికోట సుధాకర్ పాల్గొన్నారు.