ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలో శనివారం హెల్మెట్ ధరించి వాహనాలు అడుగుతామని పోలీసులు ద్విచక్ర వాహనదారుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఇటీవల జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలు హెల్మెట్ ధరించకపోవడం వల్ల ద్విచక్ర వాహనదారులు మృతి చెందుతున్న విషయాన్ని పోలీసులు వాహనదారులకు తెలిపారు. రాంగ్ రూట్లో రావడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుని ఆసుపత్రుల పాలు అవుతారని అందుకు సరైన నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడుపుతామని వాహనాదారులు ప్రతిజ్ఞ చేయాలని పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు.