తాడిపత్రి: మండలంలోని హుస్సేనాపురంలో 16 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్, రూ.89.020 నగదు, మూడు కార్లు, 13 బైక్ లు స్వాధీనం
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని హుస్సేనాపురం గ్రామంలో ఓ తోటలో పేకాట ఆడుతున్న 16 మందిని రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాటికి సంబంధించిన వివరాలను తాడిపత్రి రూరల్ సీఐ శివ గంగాధర్ రెడ్డి మంగళవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రి మండలంలోని హుస్సేనాపురం గ్రామ శివారులోని ఓ తోటలో కొందరు రహస్యంగా పేకాట ఆడుతున్నారని ఓ అజ్ఞాత వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. పక్క సమాచారంతో పేకాట శిబిరం పై సీఐ సిబ్బందితో కలిసి దాడులు చేశారు. తోటలో పేకాట ఆడుతున్న 16 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మూడు కార్లు, 13 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు, రూ.89,020 నగదు స్వాధీనం చేసుకున్నారు.