ప్రకాశం జిల్లా దొడ్డంపల్లి గ్రామంలో గత నెల 23వ తేదీన జరిగిన చోరీ ఘటనపై డిఎస్పి నాగరాజు మీడియాకు వివరాలు వెల్లడించారు. శుక్రవారం ఇద్దరు దొంగలను అదుపులకు తీసుకొని 90 గ్రాములు బంగారాన్ని రికవరీ చేసినట్లు తెలిపారు. చెడు అలవాట్లకు బానిసై దొంగలు ఇద్దరు చోరీలకు పాల్పడుతూ ఉన్నారని జిల్లాలో కూడా వీరికి ప్రాంతాలలో క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా తెలిపారు.