జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ప్రకాశం జిల్లాలో సోమవారం వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మారిన సమాజంలో మహిళల ప్రాముఖ్యత మరియు వారు ఎదుర్కొంటున్న వేధింపులు వంటి అంశాలపై విద్యార్థినీలకు అవగాహన కల్పించినట్లు పోలీసులు తెలిపారు. అలానే వ్యాసరచన పోటీలలో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులను అందజేసినట్లు పోలీసులు వెల్లడించారు.