కేంద్రంపై బీఆర్ఎస్ పార్టీ అనవసర నిందలు మోపుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 'పత్తి రైతులు ఆందోళన చెందొద్దు. వచ్చే ఏడాది మార్చి వరకు కేంద్రం పత్తిని ఎంఎస్పీ రేటుకు కొనుగోలు చేస్తుంది. ఎటువంటి తప్పుడు వార్తలు నమ్మొద్దు. కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే పత్తిని విక్రయించాలి. చెల్లింపులు నేరుగా రైతుల ఖాతాలో జమ అవుతాయి' అని అన్నారు