వైసీపీ కార్యకర్తల హంగామా భారీ ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ కు కారకైన యువకులను గుర్తించే పని లో పోలీసులు
Ongole Urban, Prakasam | Apr 21, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ కార్యకర్తలు చెలరేగిపోయారు. ఒంగోలు - నెల్లూరు బైపాస్ రహదారిలో వైసీపీ కార్యకర్తలు నడిరోడ్డుపై స్టంట్స్ చేస్తూ వాహనదాలను బెంబేలెత్తించారు. వైసీపీ మూక హంగామాతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. సోమవారం ఒంగోలులో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గానికి చెందిన వారితో సమావేశం నిర్వహించారు. అంబటి రాంబాబు రాక సందర్భంగా వైసీపీ మూక చెలరేగిపోయారు. ఒంగోలు - నెల్లూరు బైపాస్ రహదారిలో వాహనాల రాకపోకలు ఆపి రోడ్డు పై బైకులు తో స్టంట్స్ చేశారు. వైసీపీ మూక నడిరోడ్డుపై హంగామా చేస్తున్నా... పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు.