మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం బద్వీడు గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దోర్నాల వరకు కోటి రూపాయలతో తారు రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేపట్టామన్నారు.