కనిగిరి: వాగులో మహిళ మృతదేహం వెలుగు చేసిన సంఘటన కనిగిరి మండలం చీర్లదిన్నె గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీరామ్ తెలిపిన వివరాల ప్రకారం... చీర్ల దిన్నే గ్రామానికి చెందిన మానసిక దివ్యాంగురాలు అయిన కోపర్తి ధనమ్మ ఈనెల 6న గేదలను మేపుకునేందుకు పొలాల్లోకి వెళ్లి తిరిగి రాలేదు. గురువారం గ్రామంలోని నేరెళ్ల వాగులో శవమై తేలింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ శ్రీరామ్ మహిళ మృతదేహాన్ని వెలికి తీసి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.