ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని శివాజీ నగర్ లో సుమారు 5 ఎకరాలలో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఆధ్వర్యంలో క్రికెట్ స్టేడియం రూపుదిద్దుకుంటుంది. ఎమ్మార్వో శ్రవణ్ కుమార్ పర్యవేక్షణలో గ్రౌండ్ మొత్తం పూర్తిస్థాయిలో శుభ్రం చేశారు. సోమవారం గడ్డిని పెంచే కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మార్వో తెలిపారు. త్వరలో క్రీడాకారులకు స్టేడియం అందుబాటులోకి రానున్నదని పేర్కొన్నారు.