ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ సోషల్ ఫౌండేషన్ నేతలు మండిపడ్డారు. ఇక్కడ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడుతూ.. నీరు, రహదారులు, కాలుష్యం, కాలనీల సమస్యలు పెరిగినా అధికారుల్లో స్పందన లేదన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని, ప్రజల కోసం రోడ్డెక్కుతామని నేతలు స్పష్టం చేశారు.