ఒంగోలు అర్బన్: ఒంగోలు నియోజకవర్గంలో 9260 మంది రైతులకు రూ 23.514 కోట్లు అన్నదాత సుఖీభవ నిధులు
Ongole Urban, Prakasam | Jun 20, 2026
అన్నదాత సుఖీభవ –పీఎం కిసాన్ తొలి విడత నిధుల విడుదల సందర్భంగా ఒంగోలు మండలం ఉలిచి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.20,000 ఆర్థిక సహాయం అందజేస్తున్నామని చెప్పారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.6,000, రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 చొప్పున మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని వివరించారు.