డోన్: కొలుముల పల్లెలో ఎడ్ల బండి ఎక్కిన డోన్ ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | Jun 10, 2026 నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం కొలుములపల్లె గ్రామ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. అక్కడ ఆయన ఎడ్లబండి ఎక్కి ముందుకు సాగారు. ఈ ప్రభుత్వంలో రైతులకు అధిక ప్రాధాన్యత లభిస్తుందని ఆయన తెలిపారు. అనంతరం గ్రామంలో నూతన రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.